Home
POLITICAL NEWS
TELUGU POLITICAL NEWS NEWS360 POLITICAL VOICE FEATURES VOICE
FILM NEWS
TELUGU FILM NEWS SHORT STORIES MOVIE REVIEWS
SPORTS News Business News Reach Out
Home  »  Movie   »   మహేష్ బాబుకు ఈడీ మరోసారి నోటీసులు… విచారణకు హాజరవుతారా?

మహేష్ బాబుకు ఈడీ మరోసారి నోటీసులు… విచారణకు హాజరవుతారా?

టాలీవుడ్ హీరో మహేష్ బాబుకు ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) మరోసారి నోటీసులు ఇచ్చింది. సాయి సూర్య డెవలపర్స్ అనే కంపెనీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈ విచారణ జరుగుతోంది. ఈ కేసులో భాగంగా మహేష్ బాబు ఈరోజు (మే 12, సోమవారం) ఈడీ ఎదుట హాజరుకావాలని అధికారులు ఆదేశించారు.

ఇప్పటికే ఏప్రిల్ 28న మహేష్ బాబుకు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. కానీ అప్పట్లో ఆయన షూటింగ్‌లో బిజీగా ఉండటంతో హాజరుకాలేకపోయారు. దీంతో మరొక తేదీగా ఈ రోజు హాజరుకావాలని మరోసారి సమన్లు పంపారు. అయితే మహేష్ బాబు నిజంగా విచారణకు వస్తారా లేదా అనే విషయంపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది.

ఈడీ అధికారులు చెబుతున్నట్లుగా, మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశారు. ఆ ప్రచారం కోసం ఆయన రూ. 5.9 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. అందులో రూ. 3.4 కోట్లు నగదు రూపంలో, మిగిలిన రూ. 2.5 కోట్లు బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ (RTGS) ద్వారా చెల్లించారట.

అధికారులు గత నెలలో సూరానా గ్రూప్‌, సాయి సూర్య డెవలపర్స్ కార్యాలయాల్లో, ఇళ్లలో దాడులు చేశారు. దాదాపు కోట్లల్లో నగదు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. సాయి సూర్య డెవలపర్స్ ఎండీ సతీష్ చంద్రగుప్తను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన డబ్బులు వసూలు చేసి మోసం చేశాడని బాధితులు ఫిర్యాదు చేశారు.

ఇక సూరానా గ్రూప్‌కి చెందిన సంస్థలు మూడు పెద్ద బ్యాంకులకు కలిపి దాదాపు రూ. 3,986 కోట్లు బాకీ పెట్టినట్లు సీబీఐ తెలిపింది. దీనిపై మూడు కేసులు కూడా నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే గతంలో రూ. 11 కోట్ల విలువైన బంగారం, నగదు కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది.

ఇప్పుడు మహేష్ బాబు ఈ విచారణలో హాజరైతే, ఏ వివరాలు వెల్లడిస్తారో చూడాలి. లేకపోతే మరోసారి వాయిదా కోరుతారేమోనన్న అనుమానం కూడా ఉంది. మొత్తం మీద ఈ కేసు ఇంకా పెద్దదిగా మారే అవకాశముంది.

Get In Touch

© APTG360. All Rights Reserved.