Home
POLITICAL NEWS
TELUGU POLITICAL NEWS NEWS360 POLITICAL VOICE FEATURES VOICE
FILM NEWS
TELUGU FILM NEWS SHORT STORIES MOVIE REVIEWS
SPORTS News Business News Reach Out
Home  »  Movie   »   హైదరాబాద్ ప్రజలకు మరో బాంబ్‌, మెట్రో ధరల మోత! మే 17 నుంచి ప్రయాణం ఖరీదైనదే!

హైదరాబాద్ ప్రజలకు మరో బాంబ్‌, మెట్రో ధరల మోత! మే 17 నుంచి ప్రయాణం ఖరీదైనదే!

హైదరాబాద్‌లో మెట్రో ప్రయాణికులకు షాక్ తగిలింది. ఎల్ అండ్ టి హైదరాబాద్ మెట్రో టికెట్ ధరలను పెంచుతూ అధికారికంగా ప్రకటించింది. మే 17 నుంచి ఈ కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. ఇప్పటివరకు కనిష్ట టికెట్ ధర ₹10 ఉండగా ఇప్పుడు ₹12కి పెంచారు. అలాగే గరిష్ట ధరను ₹60 నుంచి ₹75కు పెంచారు. ప్రయాణ దూరాన్ని బట్టి టికెట్ ధరలు మారనున్నాయి. ఉదాహరణకు, రెండు కిలోమీటర్ల వరకు ₹12, ఆపై దూరానికి అనుగుణంగా ₹30 నుంచి ₹75 వరకు ఛార్జీలు నిర్ణయించారు. ఈ పెంపుతో రోజూ మెట్రోలో ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు తదితరులపై ఆర్థిక భారం పెరగనుంది. మధ్యతరగతి ప్రజలు ఈ పెంపుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఎల్ అండ్ టి సంస్థ ధరలు పెంపు వెనుక కారణంగా నిర్వహణ ఖర్చులు, విద్యుత్ మరియు భద్రతా ఖర్చుల పెరుగుదల ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రజలపై ఈ భారం పడకుండా ప్రభుత్వం స్పందిస్తుందా లేదా అనే ఆసక్తి నెలకొంది. ఇకపై మెట్రో ప్రయాణం చేయాలనుకునే వారు కొత్త ఛార్జీలకు అనుగుణంగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.

Get In Touch

© APTG360. All Rights Reserved.