తాప్సీ పన్ను ముంబైలో కొత్త ఫ్లాట్ కొనుగోలు – సోదరి కోసం ప్రత్యేక గిఫ్ట్
బాలీవుడ్ నటి తాప్సీ పన్ను తాజాగా ముంబైలో ఓ లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేశారు. ఈ ఫ్లాట్ను తాప్సీ తన సోదరి షగున్ పన్ను కోసం తీసుకున్నారని సమాచారం. ఫ్లాట్ ముంబైలోని గోరేగావ్ వెస్ట్ ప్రాంతంలోని ఓ ప్రీమియం అపార్ట్మెంట్లో ఉంది. దీని ధర సుమారు రూ.4.33 కోట్లు.
ఈ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ వివరాలు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (IGR) వెబ్సైట్ ద్వారా వెలుగులోకి వచ్చాయి. తాప్సీ, షగున్ ఇద్దరూ కలిసి ఈ ప్రాపర్టీని రిజిస్టర్ చేశారు. రిజిస్ట్రేషన్ కోసం వారు రూ.21.65 లక్షల స్టాంప్ డ్యూటీతో పాటు రూ.30,000 అదనపు ఛార్జీలు చెల్లించారు. ఇది “రెడీ-టు-మూవ్” ఇంటి ప్రాజెక్ట్ కావడంతో వారు త్వరలోనే చేయబోతున్నారు.
ఇప్పటికే తాప్సీకి ముంబైలో ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటిని ఆమె సోదరి షగున్ ప్రత్యేకంగా అలంకరించింది. షగున్ ఓ వెడ్డింగ్ ప్లానర్ కావడంతో ఇంటిని ఎంతో అందంగా డిజైన్ చేశారు. ఆ ఇంటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తాప్సీ గత ఏడాది డెన్మార్క్కు చెందిన బ్యాడ్మింటన్ ఆటగాడు మథియాస్ బోను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత తాప్సీ తన పాత ఇంటిలోనే భర్తతో కలిసి ఉంటున్నారు. షగున్కు స్వంతంగా ఒక ఇల్లు ఉండాలన్న ఉద్దేశంతో తాప్సీ ఈ కొత్త ఫ్లాట్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.