టీడీపీ మినీ మహానాడు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న కార్యకర్తలు
పోరంకిలోని ఎల్ఎన్ గార్డెన్స్లో ఆదివారం జరిగిన టీడీపీ మినీ మహానాడు కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. ఎలాంటి ఆహ్వానం లేకుండానే వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు పార్టీ పట్ల ఉన్న విశ్వాసాన్ని చాటిచెప్పారు.
ఈ సమావేశంలో నాయకులు ప్రసంగిస్తూ, పార్టీని నమ్మిన కార్యకర్తలే నిజమైన బలం అని చెప్పారు. టీడీపీని గ్రామస్థాయిలో బలంగా మళ్లీ నిలబెట్టాలన్న లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అభిప్రాయభేదాలు మరిచి అందరూ కలిసికట్టుగా పని చేయాలని కోరారు.
ఈ సందర్భంగా తాడిగడప మునిసిపాలిటీ అధ్యక్షుడిగా అనుమోలు ప్రభాకరరావును తిరిగి ఎన్నుకున్నారు. ఆయన పార్టీకి నమ్మకంగా పనిచేస్తారని, ప్రజల మధ్య మంచి పేరు సంపాదించారని నేతలు అభినందించారు. ఎంపిక తర్వాత ఆయన మాట్లాడుతూ, పార్టీని బలోపేతం చేయడానికి తాను కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, మహిళా శ్రేణులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మినీ మహానాడు ద్వారా పార్టీ కార్యకర్తలకు కొత్త ఉత్సాహం వచ్చిందని, రాబోయే రోజుల్లో మరింత చొరవతో పని చేస్తామని కార్యకర్తలు అన్నారు