Home
POLITICAL NEWS
TELUGU POLITICAL NEWS NEWS360 POLITICAL VOICE FEATURES VOICE
FILM NEWS
TELUGU FILM NEWS SHORT STORIES MOVIE REVIEWS
SPORTS News Business News Reach Out
Home  »  Telugu Movie   »   ధనుష్‌, ఐశ్వర్య మళ్లీ ఒక్కటే ఫ్రేమ్‌లో – మనవడిపై రజనీకాంత్ భావోద్వేగం

ధనుష్‌, ఐశ్వర్య మళ్లీ ఒక్కటే ఫ్రేమ్‌లో – మనవడిపై రజనీకాంత్ భావోద్వేగం

తమిళ హీరో ధనుష్‌ మరియు రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య విడాకులు తీసుకున్నా, తల్లిదండ్రులుగా పిల్లల పట్ల ప్రేమను చూపించడంలో మాత్రం తక్కువలేదు. ఇటీవల వారి పెద్ద కుమారుడు యాత్ర గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకున్న సందర్భంలో, ఈ ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు.

ధనుష్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో యాత్రను తల్లిదండ్రులిద్దరూ గట్టిగా హత్తుకుంటున్న ఫొటోను షేర్‌ చేశారు. ఆ ఫొటోకి “యాత్ర.. నేడు నిన్ను చూసి మేమిద్దరం చాలా గర్వంగా ఉన్నాం” అనే క్యాప్షన్ ఇచ్చారు. నెటిజన్లు కూడా చాలా రోజుల తర్వాత వీరిద్దరినీ కలసి చూడడం ఆనందంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

రజనీకాంత్‌ కూడా అదే ఫొటోను తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్‌ చేస్తూ, “నా మనవడు జీవితంలో తొలి మైలురాయి దాటాడు. అభినందనలు యాత్రా!” అని రాశారు.

ధనుష్‌–ఐశ్వర్య 2004లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు – లింగ, యాత్ర ఉన్నారు. 2022లో వీరు విడిపోతున్నట్లు ప్రకటించగా, 2024లో అధికారికంగా విడాకులు పూర్తయ్యాయి. అయినా కూడా పిల్లల కోసం వారిద్దరూ కలిసి ఉండటం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

First milestone crossed my lovable grandson 💐 congratulations yathra kanna ! ❤️❤️ pic.twitter.com/D15JexNw4g

— Rajinikanth (@rajinikanth) May 31, 2025
Get In Touch

© APTG360. All Rights Reserved.