Home
POLITICAL NEWS
TELUGU POLITICAL NEWS NEWS360 POLITICAL VOICE FEATURES VOICE
FILM NEWS
TELUGU FILM NEWS SHORT STORIES MOVIE REVIEWS
SPORTS News Business News Reach Out
Home  »  Movie   »   3452 కోర్టు వాయిదాలు? – జగన్‌పై టీడీపీ సంచలన ఆరోపణలు

3452 కోర్టు వాయిదాలు? – జగన్‌పై టీడీపీ సంచలన ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఇప్పుడు “3452” అనే నంబర్‌ హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల వరకూ “11” అనే సంఖ్యతో వైసీపీని, ముఖ్యంగా జగన్‌ మోహన్ రెడ్డిని టార్గెట్ చేసిన టీడీపీ, ఇప్పుడు 3452 అనే కొత్త లెక్కను బయట పెట్టింది. ఈ సంఖ్య జగన్ కోర్టులో ఇప్పటివరకు తీసుకున్న వాయిదాల సంఖ్య అని టీడీపీ అంటోంది.

ఇటీవల జగన్‌ పలు ప్రెస్ మీట్లలో చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఆయన లిక్కర్ కేసులో బెయిల్‌పై బయట తిరుగుతున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్‌గా టీడీపీ ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ, జగన్‌పై మొత్తం 31 కేసులున్నాయని, వాటిలో 7 ఈడీ, 11 సీబీఐ కేసులు కూడా ఉన్నాయని చెప్పారు. ఇవన్నీ కేసులు ఇంకా పరిష్కారం కాకుండా, 3452 సార్లు వాయిదాలు తీసుకున్నారని ఆరోపించారు.

ఇంతవరకూ జగన్ కోర్టు కేసులపై లీగల్ ఫీజులకే దాదాపు రూ. 6,900 కోట్లు ఖర్చు పెట్టారని టీడీపీ చెప్పింది. ఒక్క వాయిదా రోజుకే సగటున రూ. 1.39 కోట్లు ఖర్చవుతోందని పేర్కొన్నారు. ఇది ప్రపంచ రికార్డే అని టీడీపీ చెబుతోంది.

ఇదిలా ఉండగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ఆరోపణలపై మండిపడుతోంది. టీడీపీ నాయకులు మీడియా సమావేశంలో ఉపయోగించిన భాష సరైంది కాదని, వారు వ్యక్తిగత స్థాయికి దిగుతున్నారని విమర్శిస్తోంది. తాము ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నామనీ, టీడీపీ వాస్తవాలను మరిచి తప్పుడు ప్రచారం చేస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ప్రస్తుతం “3452” అనే సంఖ్యపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ సాగుతోంది. టీడీపీ, జనసేన వర్గాలు ఈ సంఖ్యతో జగన్‌ను విమర్శిస్తుండగా, వైసీపీ నేతలు మాత్రం స్పందనలో మాటల తూటాలు పేలుస్తున్నారు. జగన్‌ నిజంగా ధైర్యంగా ఉంటే, కోర్టులో రోజూ హాజరై కేసులు ఎదుర్కొనాలని టీడీపీ సవాల్ చేస్తోంది.

ఈ లెక్కలాటే కాకుండా, నిజమైన విషయాలు ఏంటన్నదాన్ని ప్రజలు స్వయంగా అర్థం చేసుకోవాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజంగా జగన్‌పై ఉన్న కేసుల విషయంలో స్పష్టత రాలేదంటే, ఈ ఆరోపణలకూ వాదనలకూ ముగింపు ఇప్పట్లో కనిపించదు.

Get In Touch

© APTG360. All Rights Reserved.