Home
POLITICAL NEWS
TELUGU POLITICAL NEWS NEWS360 POLITICAL VOICE FEATURES VOICE
FILM NEWS
TELUGU FILM NEWS SHORT STORIES MOVIE REVIEWS
SPORTS News Business News Reach Out
Home  »  Movie   »   తిరుమల పరువు దెబ్బతీసే కుట్రలకు జగన్ ప్రభుత్వమే కారణం:బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి<Video>

తిరుమల పరువు దెబ్బతీసే కుట్రలకు జగన్ ప్రభుత్వమే కారణం:బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి<Video>

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) దేశవ్యాప్తంగా భక్తుల విశ్వాసానికి ప్రాతినిధ్యం వహించే పవిత్ర స్థలం. అయితే ఇటీవల ఈ దేవస్థానాన్ని కించపరిచేలా కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి. వాటికి వెనుక జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందన్న ఆరోపణలు తీవ్రమవుతున్నాయి.

ఇటీవల తిరుమలలో ఓ భక్తుడు టీటీడీ అధికారులపై నినాదాలు చేస్తూ వీడియో తీసాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే విచారణలో ఆ భక్తుడు తాను చేసినది తప్పేనని ఒప్పుకున్నాడు. క్షమాపణలు కూడా అడిగాడు. మరి అసలు సమస్య ఏమిటంటే – ఆ వీడియో తీసేటప్పుడు అక్కడ ఉన్న కొంతమంది భక్తుడికి “ఏం చెప్పాలి”, “ఎలా చెప్పాలి” అనేలా సూచనలు ఇవ్వడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ వీడియో కూడా యధేచ్చగా సామాజిక మాధ్యమాల్లో షేర్ కావడం, జగన్ అనుకూల పేజీల్లో విస్తృతంగా ప్రచారం కావడం చూస్తే, ఇది యథేచ్చగా జరిగిందనడానికి అవకాశం లేదు. ఇది జగన్ ప్రభుత్వానికి సంబంధించిన వారి పక్కా పథకం కావచ్చని అనుమానం వేస్తోంది.

ఈ విషయంపై టీటీడీ బోర్డు సభ్యుడు, బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి స్పందించారు. జగన్ ప్రభుత్వం తిరుమల ప్రతిష్టను తక్కువ చేసేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఆయన రాష్ట్ర డీజీపీకి లేఖ రాసి – జగన్ అనుచరులపై పోలీస్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.

ఇది కొత్తది కాదు. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో వివాదాలు తిరుమలపై వచ్చాయి. ఉదాహరణకు – శ్రీవారి లడ్డూల్లో జంతు పదార్థాలు ఉన్నాయని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. జగన్ ప్రభుత్వం అవి తక్కువ చేస్తూ దాచిపెట్టే ప్రయత్నం చేసింది. ఇప్పుడదే కేసు కొత్త ప్రభుత్వం విచారిస్తోంది. నిజాలు బయటకు వస్తే జగన్ హయాంలో జరిగిన తప్పుడు చర్యలు బయటపడే అవకాశం ఉంది.

వాస్తవంగా చెప్పాలంటే, జగన్ ప్రభుత్వానికి ధర్మంపై గౌరవం లేదు. తిరుమల వంటి పవిత్రమైన స్థలాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం దురదృష్టకరం. ప్రజల విశ్వాసాలను దెబ్బతీసే ఈ కుట్రలకు ప్రజలే సమాధానం చెప్పాలి.

#PsychoFekuJagan
కలియుగ దైవం వెంకటేశ్వరుని సన్నిధిలో మళ్ళీ వైసీపీ కుట్రలు మొదలయ్యాయి. నిన్న తిరుమల దర్శన కంపార్ట్ మెంటులో నిరసన వ్యక్తంచేసిన వ్యక్తి కాకినాడ రూరల్ తిమ్మాపురానికి చెందిన వైసీపీ నాయకుడు బద్దిలి అచ్చారావు. ఒక పథకం ప్రకారం అతడితో వైసీపీ పేటీఎం బ్యాచ్ డ్రామా ఆడించి… pic.twitter.com/CkJu6JuvJZ

— Lokesh Nara (@naralokesh) May 31, 2025
Get In Touch

© APTG360. All Rights Reserved.