బ్రిటన్ వలస నిబంధనలు కఠినతరం – పౌరసత్వానికి పదేళ్ల నిరీక్షణ
బ్రిటన్ ప్రభుత్వం వలసలపై కఠిన నిర్ణయం తీసుకుంది. ఇకపై బ్రిటన్ పౌరసత్వం పొందాలంటే ఆ దేశంలో కనీసం 10 ఏళ్లపాటు నివసించాలి. ఇప్పటివరకు ఇది 5 ఏళ్లు మాత్రమే ఉండే సమయంలో, ఇప్పుడు ప్రభుత్వం దీన్ని రెట్టింపు చేసింది.
ఈ కొత్త నిబంధనలు విద్య, ఉద్యోగం, లేదా కుటుంబ కారణంగా బ్రిటన్కు వచ్చేవారందరికీ వర్తిస్తాయి. గతంలో ఐదు సంవత్సరాలు బ్రిటన్లో ఉన్నవారికి ఆటోమేటిక్గా పౌరసత్వం లభించే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ అవకాశం ఇక ఉండదు.
నైపుణ్యం ఉన్నవారికి ముందుగా పౌరసత్వం ఇస్తాం. ముఖ్యంగా డాక్టర్లు, నర్సులు, ఇంజినీర్లు, కృత్రిమ మేధ (AI) రంగంలో పని చేసే వాళ్లకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని ప్రధానమంత్రి కిర్ స్టార్మర్ చెప్పారు.
ఇంకా, బ్రిటన్కు వలస వస్తున్నవారికి తక్కువ స్థాయి ఇంగ్లీష్ కాకుండా మంచి ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. అలాగే బ్రిటన్లో ఇప్పటికే ఉన్న విదేశీయులపై ఆధారపడి పౌరసత్వం కోరేవారికి కూడా కనీస ఇంగ్లీష్ పరిజ్ఞానం తప్పనిసరి చేస్తోంది ప్రభుత్వం.
ఈ మార్పులపై పూర్తి వివరాలు త్వరలో పార్లమెంట్లో విడుదల కానున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది.