Home
POLITICAL NEWS
TELUGU POLITICAL NEWS NEWS360 POLITICAL VOICE FEATURES VOICE
FILM NEWS
TELUGU FILM NEWS SHORT STORIES MOVIE REVIEWS
SPORTS News Business News Reach Out
Home  »  Movie   »   ఇలాంటి ఘటనల వల్ల ప్రజలకు గుర్తొచ్చింది – జగన్ పాలన అంటే గొడవలు, బెదిరింపులు, పిచ్చి చేష్టలు : నారా లోకేష్<Video>

ఇలాంటి ఘటనల వల్ల ప్రజలకు గుర్తొచ్చింది – జగన్ పాలన అంటే గొడవలు, బెదిరింపులు, పిచ్చి చేష్టలు : నారా లోకేష్<Video>

ఏది మంచి? ఏది చెడు? అనే విషయాలు ఆ పార్టీకి సంబంధించవు. ప్రజలు ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా, జగన్ నాయకత్వంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరు మాత్రం ఎప్పటికీ మారదు. నాయకుడు మారకపోతే, కార్యకర్తలు ఎలా మారతారు?

ఇటీవల మైలవరం వద్ద ఓ మాజీ మంత్రి ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లిన జగన్ పార్టీ అనుచరులు, అక్కడ చూపిన ప్రవర్తన చూస్తే మానవత్వం పూర్తిగా మరిచిపోయారనేలా ఉంది.. చిన్నపిల్ల చేతిలో ఉన్న సైకిల్ లాక్కొని దాన్ని తొక్కుతూ పగలగొట్టిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇది పిల్లవాడిపై కక్షా కాదు, ఇది ప్రజలపై జగన్ పార్టీ చూపిస్తున్న అసలైన మానసిక స్థితి.

ఇది చిన్న సంఘటన కాదు – ఇది జగన్ పార్టీ స్థాయిని చూపించే ఉదాహరణ!

వారు అధికారంలో ఉన్నప్పుడు తాము చేసిన తప్పులను జనం గుర్తు చేయగానే, అసభ్యంగా స్పందించడం, ధ్వంసం చేయడం, భయపెట్టడం – ఇవే ఆ పార్టీ స్టైలు. పూజలు జరుగుతున్న ఇంట్లోకి వెళ్లి ఇలా వాడుదీ, పాడుదీ అనే విధంగా ప్రవర్తించడం సిగ్గుచేటు.

#PsychoJagan #YSRCPRowdyism
అబ్బే వాళ్ళేమీ మారలేదు….. వాళ్ళేమీ మారరు కూడా….. ఏ ముహూర్తాన సైకో అని పెట్టామో… ఆ పేరును సార్ధకం చేసుకోవడానికి నిరంతరం పని చేస్తూనే ఉంటారు. అందుకే నాటికి నేటికీ ఎప్పటికీ అదొక సైకో పార్టీ… వాళ్ళకి సైకో నాయకుడు! ప్రజలు బుద్ధి చెప్పినా మారని… pic.twitter.com/8fKlFYmG2o

— Lokesh Nara (@naralokesh) June 1, 2025
Get In Touch

© APTG360. All Rights Reserved.