అఖిల్ పెళ్లి కోసం సీఎం చంద్రబాబును కలిసిన నాగార్జున – ఫోటోలు వైరల్
అక్కినేని కుటుంబంలో మళ్లీ పెళ్లి సందడి మొదలైంది. నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ త్వరలో పెళ్లి చేసుకోనున్నాడు. ఈ పెళ్లి జూన్ 6న హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో జరగనుంది.
ఈ సందర్భంగా హీరో నాగార్జున, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడిని కలిసి అఖిల్ పెళ్లికి ఆహ్వానించారు. ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లి, ఆయనకు వివాహ ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అఖిల్, జైనబ్ రవ్జీ అనే యువతితో గత ఏడాది నవంబర్లో నిశ్చితార్థం జరిపారు. ఇప్పుడు వీరిద్దరూ కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే, నాగార్జున ప్రస్తుతం “కుబేర” సినిమా ప్రచారాల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తుండగా, ధనుష్ మరియు రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
అఖిల్ కూడా ప్రస్తుతం “లెనిన్” అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు కిశోర్ అబ్బూరూ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీలీల ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. గతంలో చేసిన సినిమాలు పెద్దగా విజయాలు అందుకోకపోయినా, ఇప్పుడు ఈ సినిమాతో మంచి హిట్ కోసం అఖిల్ కృషి చేస్తున్నాడు.
ఇంతలో అతని పెళ్లి వార్త సినిమాప్రముఖులు, అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది. పెళ్లి వేడుకను అక్కినేని కుటుంబం ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.