Home
POLITICAL NEWS
TELUGU POLITICAL NEWS NEWS360 POLITICAL VOICE FEATURES VOICE
FILM NEWS
TELUGU FILM NEWS SHORT STORIES MOVIE REVIEWS
SPORTS News Business News Reach Out
Home  »  Movie   »   అప్పుడు క్షమాపణ చెప్పలేదే? – కొమ్మినేని వ్యవహారంపై మాజీ మంత్రి రోజా ఆగ్రహం<వీడియో>

అప్పుడు క్షమాపణ చెప్పలేదే? – కొమ్మినేని వ్యవహారంపై మాజీ మంత్రి రోజా ఆగ్రహం<వీడియో>

సాక్షి టీవీ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు విషయమై మాజీ మంత్రి ఆర్‌.కె. రోజా తీవ్రంగా స్పందించారు. అమరావతిపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టైన కొమ్మినేని వ్యవహారంలో రాజకీయ కుట్రే దాగుందని ఆమె వ్యాఖ్యానించారు.

“కొమ్మినేని తప్పులు చేసే మనిషి కాదు,” అని మొదలుపెట్టిన రోజా, ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్‌ అని, టీవీ చర్చల్లో ఎవరైనా తప్పుగా మాట్లాడితే వెంటనే అభ్యంతరం చెప్పే వ్యక్తి అని పేర్కొన్నారు. అసలైన వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజుపై కాకుండా, చర్చ నిర్వహించిన కొమ్మినేని మీదే కేసు పెట్టడాన్ని తప్పుబట్టారు.

“ఎవరైనా క్షమాపణ చెప్పాలంటే, ముందుగా టీడీపీ చెప్పాలి” అని రోజా పేర్కొన్నారు. గతంలో తాను మంత్రి అయ్యేటప్పుడు టీడీపీ నాయకులు తనపై తీవ్రంగా, అసభ్యంగా మాట్లాడారని ఆరోపించారు. ముఖ్యంగా బండారు సత్యనారాయణ తో నిందలు వేయించి చంద్రబాబు, లోకేష్‌లు తనను అవమానించారని గుర్తు చేశారు. ఆ సందర్భాల్లో మాత్రం వారెవరూ క్షమాపణ చెప్పలేదని ఆమె వాపోయారు.

“ఆడవారి పుట్టుకను అవమానించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు” అని బాలకృష్ణ వ్యాఖ్యలను ఉదహరిస్తూ రోజా నిలదీశారు. అదే విధంగా, భారతి, విజమ్మ వంటి మహిళా నేతలపై అసభ్యంగా మాట్లాడిన నేతలపై కేసులు పెట్టకపోతే, ఇప్పుడు జగన్, భారతి మేడమ్‌లపై క్షమాపణలు అడగడంలో లాజిక్ ఏముందని ప్రశ్నించారు.

“కేసులు పెట్టాలంటే.. సమానంగా పెట్టాలి” అని ఆమె కోరారు. టీవీ5 చర్చలో రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని, మూర్తి అనే చర్చ నిర్వాహకుడిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొమ్మినేని విషయంలో మాత్రం వైసీపీ నేతలు నిష్క్రమణాత్మకంగా వ్యవహరించారని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.

“తప్పు చేస్తే ఎవరిదైనా ఖండించాలి. కానీ రాజకీయ లాభాల కోసం మౌనంగా ఉండకూడదు,” అని రోజా పేర్కొన్నారు. ఇక కొమ్మినేని శ్రీనివాస్‌కు కోర్టు రెండు వారాల రిమాండ్ విధించడంపై ఆమె స్పందిస్తూ, ఇది పూర్తిగా అన్యాయం అన్నారు. అసలైన బాధ్యత గలవారిని వదిలేసి, అనవసరంగా ఒక జర్నలిస్ట్‌ను లక్ష్యంగా చేసుకోవడాన్ని ప్రజలు కూడా తప్పుబడుతున్నారని చెప్పారు.

మహిళలకు ముందు క్షమాపణ చెప్పాలనిపిస్తే చంద్రబాబు, బాలకృష్ణ నారా లోకేష్ , బండారు సత్యనారాయణ, రేణుకా చౌదరి, మూర్తి, బీఆర్ నాయుడు, చేబోలు కిరణ్ లు చెప్పాలి

-రోజా మాస్ కౌంటర్ 🔥 pic.twitter.com/A9W3KsmGbI

— Rahul (@2024YCP) June 10, 2025
Get In Touch

© APTG360. All Rights Reserved.