ఆంధ్రా కి ఉపశమనం తీసుకొచ్చిన వర్షాలు.. కానీ జాగ్రత్త అవసరం
ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎండలతో బలహీనమైన ప్రజలకు ఇప్పుడు వర్షాలు కొంత ఊరటనిస్తుండగా, కొన్ని చోట్ల మాత్రం ఈ వర్షాలు ప్రమాదాలకి దారి తీస్తున్నాయి.
వర్షాలు ఎక్కువగా ఎక్కడ పడుతున్నాయి?
కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి.
వర్షాలతో కలిగిన మంచిపలితాలు ఏమిటి?
వర్షాల కారణంగా వాతావరణం చల్లబడింది. ఉక్కపోతలో విసిగిపోయిన ప్రజలకు ఇది తాత్కాలిక ఉపశమనం. కొన్ని ప్రాంతాల్లో చెరువులు నిండుతున్నాయి, పొలాల్లో తడి ఏర్పడింది. తుంగభద్ర నదిలో ప్రవాహం పెరగడం వల్ల పలు ప్రాజెక్టులు నీటితో నిండుతున్నాయి. ఇది రైతులకు ఆనందకరమైన విషయం.
వర్షాల వల్ల కొన్ని ప్రమాదాలు కూడా జరిగాయి
శ్రీకాకుళంలో ఓ తండ్రి మరియు కొడుకు పిడుగుపాటుకు గురయ్యారు. తండ్రి చనిపోయాడు, కొడుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అలాగే కాకినాడ జిల్లాలో నాటు పడవ బోల్తా పడింది. ముగ్గురిలో ఇద్దరు సురక్షితంగా బయటపడగా, ఒక యువకుడు గల్లంతయ్యాడు.
వాతావరణ శాఖ సూచనలు
వర్షాలు మరో రెండు రోజులు పడే అవకాశం ఉంది. ప్రజలు ఎవరైనా లోతట్టు ప్రాంతాల్లో ఉంటే జాగ్రత్తగా ఉండాలి. ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో బయట తిరగకూడదు. పాత భవనాల్లో ఉండే వారు సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి.