ఆపరేషన్ సిందూర్పై వ్యాఖ్యలు చేసిన ప్రొఫెసర్ అరెస్ట్ – దేశవ్యాప్తంగా చర్చ
ఆపరేషన్ సిందూర్పై సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యల కారణంగా అశోకా యూనివర్శిటీలో పని చేస్తున్న పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ అలీ ఖాన్ మహమూదాబాద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్కు సంబంధించి మహమూదాబాద్ చేసిన ఒక పోస్టు రాజకీయంగా చర్చనీయాంశమైంది. పోస్టులో, కల్నల్ సోఫియా ఖురేషిని ప్రశంసిస్తున్న కుడి పక్ష అనుచరులను ప్రశ్నిస్తూ – “ఇలాంటివారే మాబ్ లించింగ్లు, ఇళ్ల కూల్చివేతలు జరుగుతున్నప్పుడు ఎందుకు మాట్లాడరు?” అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఒక బీజేపీ కార్యకర్త ఫిర్యాదు చేయగా, ఢిల్లీలో పోలీసులు మహమూదాబాద్ను అరెస్ట్ చేశారు. హర్యానా మహిళా కమిషన్ కూడా ఆయనకు నోటీసులు జారీ చేసింది.
తన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారని మహమూదాబాద్ స్పష్టీకరణ ఇచ్చారు. అయితే, ఈ అరెస్టుపై నేతలు, విద్యావంతులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ, “ఇది దేశంలో వ్యక్తిగత స్వేచ్ఛపై దాడి. ఆయన మాట్లాడింది దేశద్రోహం కాదని, అలాంటప్పుడు అరెస్ట్ చేయడం తప్పని చెప్పారు. ఈ అరెస్టు చూడగానే షాక్ అయ్యానని సుభాషిణి అలీ అన్నారు. అరెస్ట్కి కారణమైన వ్యాఖ్యలు ప్రొఫెసర్ వ్యక్తిగత అభిప్రాయమేనని, యూనివర్సిటీ అభిప్రాయంగా చూడవద్దని అశోకా యూనివర్శిటీ అధికారిక ప్రకటనలో తెలిపింది.