ఆర్బీఐ కొత్త రూ.20 నోట్లను విడుదల చేయబోతోంది – పాత నోట్లు చెల్లుతాయి
భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) త్వరలో కొత్త రూ.20 నోట్లను విడుదల చేయబోతోంది. ఈ నోట్లపై ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుంది.
ఆర్బీఐ తెలిపిన వివరాల ప్రకారం, ఈ నోట్లు మహాత్మా గాంధీ (న్యూ) సిరీస్ లో ఉంటాయి. డిజైన్, రంగు, పరిమాణం పాత నోట్ల మాదిరిగానే ఉంటాయి. ముందు భాగంలో మహాత్మా గాంధీ చిత్రం ఉంటుంది. వెనుక భాగంలో ఎల్లోరా గుహల చిత్రం ముద్రితంగా ఉంటుంది.
ఈ నోట్ల రూపకల్పనలో పెద్దగా మార్పులు లేవు. కొత్త గవర్నర్ వచ్చాక ఆయన సంతకంతో నోట్లను ముద్రించడం ఒక సాధారణ ప్రక్రియ మాత్రమే.
అంతేగాక, పాత రూ.20 నోట్లు పూర్తిగా చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. ప్రజలు ఆ నోట్లను మార్చాల్సిన అవసరం లేదు. అన్ని బ్యాంకుల్లో పాత, కొత్త నోట్లు రెండూ సరే చెల్లుబాటు అవుతాయి.
ఈ కొత్త నోట్లు త్వరలో బ్యాంకుల ద్వారా ప్రజలకు అందుబాటులోకి వస్తాయని RBI తెలిపింది. ప్రజలు ఎలాంటి గందరగోళం లేకుండా పాత నోట్లు యథావిధిగా ఉపయోగించవచ్చు.