క్యాన్సర్ నిర్మూలన కోసం చంద్రబాబు – బిల్ గేట్స్ ఫౌండేషన్తో కలిసి చర్యలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల ఆరోగ్యం పట్ల గొప్ప నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో క్యాన్సర్ వ్యాధిని తగ్గించేందుకు మరియు పూర్తిగా నివారించేందుకు బిల్ గేట్స్ ఫౌండేషన్ తో కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు.
శనివారం కోనసీమ జిల్లా చెయ్యేరు గ్రామంలో జరిగిన “పీ4 బంగారు కుటుంబం” కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. అక్కడ ఆయన గ్రామ ప్రజలతో మాట్లాడారు. వారి సమస్యలు నేరుగా అడిగి తెలుసుకున్నారు.
వితంతువులకు అండగా సీఎం
ఒక మహిళ తన భర్త క్యాన్సర్తో చనిపోయాడని, తనకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారని, సొంత ఇల్లు కూడా లేదని చెప్పింది. దీనిని విన్న చంద్రబాబు వెంటనే అధికారులను ఆ కుటుంబానికి ఇల్లు మంజూరు చేయాలని ఆదేశించారు. పెన్షన్ కూడా ఇప్పించాలని చెప్పారు.
అదే సమయంలో ఆ మహిళ పెద్దకుమార్తె డాక్టర్ కావాలనుకుంటున్నానని, ఇంకొక అమ్మాయి ఐపీఎస్ కావాలనుకుంటున్నానని చెప్పాయి. ఈ విషయాన్ని విన్న గ్రామ పెద్ద త్సవటపల్లి నాగేంద్రరావు, ఆ ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకుంటానని చెప్పారు. వాళ్ల చదువులు, అవసరాలన్నింటికీ సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.
ఇంకొంతమందికీ సహాయం
ఇంకొక మహిళ – సత్యవతి – తన భర్త రోడ్డుపై ఇస్త్రీ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడని చెప్పింది. తమకు ఇల్లు లేదని చెప్పింది. చంద్రబాబు ఆమెకూ ఇల్లు మంజూరు చేయమని అధికారులను ఆదేశించారు. మంతెన రామరాజు అనే దాత ఆమె పిల్లల చదువు, ఇల్లు నిర్మాణం, కిరాణా వ్యాపారం పెట్టుకోవడానికి సహాయం చేస్తానని చెప్పారు.
కూలీలతో ముఖాముఖి
చెయ్యేరు గ్రామంలో చెరువు పూడికతీత పనుల ప్రారంభం సందర్భంగా చంద్రబాబు ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు ఎలా ఉపయోగపడుతున్నాయో నేరుగా అడిగి తెలుసుకున్నారు. రెండు కూలీలకు పింఛన్ సొమ్ము కూడా స్వయంగా అందజేశారు.
టెక్నాలజీతో ఆరోగ్య మార్గదర్శనం
చంద్రబాబు తన చేతికి వేసుకున్న మానిటర్ రింగ్ చూపించారు. ఇది హార్ట్బీట్, నిద్ర సమయం, శరీర కేలరీలు వంటి వివరాలను తెలియజేస్తుందని చెప్పారు. ఇటువంటి ఆధునిక సాంకేతికతతో ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు.