Home
POLITICAL NEWS
TELUGU POLITICAL NEWS NEWS360 POLITICAL VOICE FEATURES VOICE
FILM NEWS
TELUGU FILM NEWS SHORT STORIES MOVIE REVIEWS
SPORTS News Business News Reach Out
Home  »  Movie   »   రఘురామ సంచలన వ్యాఖ్యలు: జగన్‌కు భవిష్యత్తే లేదని జోస్యం, కూటమి బలంపై ఎంపీ ధీమా

రఘురామ సంచలన వ్యాఖ్యలు: జగన్‌కు భవిష్యత్తే లేదని జోస్యం, కూటమి బలంపై ఎంపీ ధీమా

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు మరోసారి తనదైన ఫైర్ బ్రాండ్ శైలిలో రాజకీయాలను హీటెక్కించారు. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమిలో కొన్ని విభేదాలు ఉన్నా, వాటిని పెద్ద సమస్యలుగా భావించవద్దని, రాజీతో ముందుకెళ్లడమే రాజకీయాల సారం అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పొత్తు కొనసాగాలని తాను కోరుకుంటున్నానని వెల్లడించారు.

జగన్‌పై తీవ్ర విమర్శలు:

మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని మరోసారి తీవ్రంగా టార్గెట్ చేసిన రఘురామ, ఆయనకు ప్రస్తుతం ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడం తాను మూడేళ్లకు ముందే అంచనా వేసినట్లేనని పేర్కొన్నారు. అసెంబ్లీలో పాల్గొనడం కోసం హోదా కావాలంటూ జగన్ పెట్టుకున్న షరతును మూర్ఖత్వంగా అభివర్ణించారు. ప్రజలకు మేలు చేసే పథకాలపై పని చేయడం మొదలైందని, ‘సూపర్ సిక్స్’ పథకాలను దశలవారీగా అమలు చేస్తామని చెప్పారు. వైసీపీ నేతలు పథకాలపై అనవసరంగా అల్లరి చేస్తున్నారని విమర్శించారు.

వైసీపీ నేతలకు కౌంటర్:

తనపై గతంలో వైసీపీ నేతలు చెప్పులతో ఫొటోలు కొట్టించిన సందర్భాన్ని గుర్తుచేసి, ఇప్పుడు అమరావతిలో జగన్ మద్దతుదారుల ఫొటోలను చెప్పులతో కొట్టడం తప్పేంటి అని కౌంటర్ ఇచ్చారు. పైగా ఆ మహిళలను “సంకర జాతి” అని వ్యాఖ్యానించిన సజ్జలపై ఘాటుగా స్పందించారు. కొమ్మినేని, కృష్ణంరాజుల వ్యాఖ్యలు పేడలో కాలు వేసినట్టేనని, దానికి వాసన చూసే వ్యక్తులు ఎవరన్నదీ ప్రజలు అర్థం చేసుకోవాలని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు కుటుంబంపై అసభ్య వ్యాఖ్యలు, కస్టోడియల్ టార్చర్:

చంద్రబాబు కుటుంబంపై విపక్ష నేతలు చేసిన అసభ్య వ్యాఖ్యలపై కూడా రఘురామ తీవ్రంగా మండిపడ్డారు. వంశీ, అనిల్ లాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోకపోతే ప్రజలు ఆత్మగౌరవాన్ని పోగొట్టుకున్నట్టవుతుందని అన్నారు. “అలాంటి వ్యాఖ్యలు చేసే వారిని ప్రజల ముందు నిలబెట్టి శిక్షించాలి,” అంటూ హాట్ కామెంట్ చేశారు.

జగన్ హయాంలో తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్ కేసు విషయాన్ని గుర్తు చేస్తూ, అప్పటి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌ను ఇప్పటికీ విచారణకు పిలవకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఎందుకు ఈ ఉపేక్ష?” అంటూ ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు.

ఉండి నియోజకవర్గ అభివృద్ధి:

తన నియోజకవర్గం ఉండిలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి కూడా రఘురామ వివరించారు. డ్రైనేజీ, తాగునీరు సమస్యలను పూర్తిగా పరిష్కరించేందుకు స్వయంగా డబ్బులు వెచ్చించానని చెప్పారు. మైక్రో ఫిల్టర్‌లు, సీసీ కెమెరాలు, స్కూల్ మరమ్మతులు, పోలీస్ స్టేషన్ నిర్మాణం, పోలీసు వాహనాల కొనుగోలు వంటి పనులను ప్రభుత్వ నిధులు లేకుండానే చేయగలిగానని వెల్లడించారు. ఆయన మాటల్లో, “ఇది మాకు పరిపాలన కాదు, నిబద్ధత,” అని స్పష్టమవుతుంది.

తన నియోజకవర్గాన్ని అభివృద్ధిలో బెంచ్‌మార్క్‌గా నిలబెట్టడమే లక్ష్యమని, అది తాను సాధిస్తానన్న నమ్మకం తనకు ఉందని రఘురామ పేర్కొన్నారు. జగన్‌కు రాజకీయంగా ఇక అవకాశమే లేదని, ప్రజలు తనను, తన ప్రభుత్వాన్ని తిరస్కరించారని మరోసారి స్పష్టం చేశారు.

Get In Touch

© APTG360. All Rights Reserved.