అదృష్టం అంటే ఇదే! భూమి చౌహాన్కు రెండో జన్మ ఇచ్చిన పది నిమిషాల ఆలస్యం
ఒక సాధారణ రోజున జరిగింది గానీ, జీవితాంతం మర్చిపోలేని మలుపు. లండన్లో భర్తతో కలిసి జీవిస్తున్న భూమి చౌహాన్ రెండు సంవత్సరాల తర్వాత ఇండియాకు వెకేషన్ కోసం వచ్చారు. తిరిగి లండన్ వెళ్లేందుకు ఎయిరిండియా విమానానికి టికెట్ బుక్ చేసుకున్నారు. ఆమె ఎక్కాల్సిన విమానం ఏకంగా 265 మంది ప్రాణాలను బలిగొన్న అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో భాగమైంది. కానీ అదృష్టం ఆమె వెంట నిలబడ్డది.
ఆ రోజు మధ్యాహ్నం భూమి విమానాశ్రయానికి బయలుదేరారు. కానీ అహ్మదాబాద్ నగర ట్రాఫిక్ ఆమెకు పదినిమిషాల ఆలస్యం చేయించింది. ఎయిర్పోర్ట్కు చేరేసరికి విమానం టేకాఫ్ అయిపోయింది. భూమి నిరాశతో విమానాశ్రయం బయటకు వచ్చారు. ఆమెకు అప్పటికి తెలియదు – ఆ ఆలస్యం ఆమెకు జీవితం ఇచ్చిందని.
విమానం టేకాఫ్ అయిన 39 సెకన్లలోనే కుప్పకూలి ఘోర విషాదం నింపింది. మృతుల్లో మాజీ సీఎం విజయ్ రూపానీ సహా 265 మంది ఉన్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే భూమికి గుండె దడదడలాడింది. షాక్లోకి వెళ్లిపోయారు. ట్విట్టర్లో స్పందిస్తూ, “పది నిమిషాల ఆలస్యం నాకు ప్రాణాల్ని ఇచ్చింది. దేవుడు నన్ను రక్షించాడు. ఇంకా బ్రతికే ఉన్నానన్న మాట నన్నే ఆశ్చర్యంలో ముంచేస్తోంది” అన్నారు.
ఈ సంఘటనతో భూమి అదృష్టం నమ్మకంగా నిలిచిందని ప్రపంచానికి మరోసారి ఋజువైంది. ఎవరూ ఊహించని పరిస్థితుల్లో, ఊహించని విధంగా ఆమె ప్రాణాలు దైవహస్తం వల్లే నిలబడ్డాయి. ఆమె జీవితంలో ఈ ‘పది నిమిషాలు’ మాటల్లో చెప్పలేని విలువను సంతరించుకున్నాయి. నిజంగా చెప్పాలి అంటే – అదృష్టం ఎవ్వర్ని వదలదని కాదు, కానీ భూమి చౌహాన్ను మాత్రం ఎంతో ప్రేమగా కౌగిలించుకుంది.