ఆంధ్రజ్యోతి తప్పుడు ప్రచారంతో పత్రికా విలువలు తగ్గిపోతున్నాయి: కవిత ఆగ్రహం
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆంధ్రజ్యోతి పత్రికపై తీవ్రంగా మండిపడ్డారు. తాను కొత్త పార్టీ పెడతానంటూ, కాంగ్రెస్లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నానంటూ వచ్చిన కథనాలను ఆమె ఖండించారు.
ఈ వార్తలపై కవిత సోషల్ మీడియాలో స్పందిస్తూ, “నన్ను ఎలాంటి సమాచారం లేకుండా ఇలా వార్తలు రాయడమా? జర్నలిజం చేస్తున్నారు? లేక కావాలనే నన్ను వేదించడానికా?” అంటూ ప్రశ్నించారు. “ఇలా అబద్ధాలు రాసే పత్రికల వల్ల ప్రజల్లో తప్పుదారి పడే అపోహలు పుడుతున్నాయి” అన్నారు.
కవిత తేల్చి చెప్పిన విషయం ఏమిటంటే – తాను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినవాళ్లని, కొత్త పార్టీ గురించి ఏ ఆలోచన కూడా లేదని స్పష్టం చేశారు. “నేను కాంగ్రెస్తో మాట్లాడలేదని, నా ప్రాధాన్యత బీఆర్ఎస్ పార్టీనే” అని ఆమె స్పష్టంగా చెప్పారు.
తన పేరు వాడుకొని కల్పిత కథలు రాయడం తగదని, నైతిక విలువలతో కూడిన నిజమైన జర్నలిజం అవసరమని ఆమె అన్నారు. “ఇలాంటివి జర్నలిజం కాదు, శాడిజం” అంటూ ఆంధ్రజ్యోతిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.