ఒబుళాపురం కేసు: విచారణ చేపట్టేందుకు ముగ్గురు న్యాయమూర్తులు నిరాకారం
ఒబుళాపురం ఇనుప ఖనిజం అక్రమ తవ్వకాల కేసు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈ కేసులో సీబీఐ కోర్టు జైలు శిక్ష విధించిన తర్వాత, దోషులైన గాలి జనార్దన్ రెడ్డి, బీవీ శ్రీనివాస్ రెడ్డి, ఓఎంసీ కంపెనీ, మెఫజల్ ఖాన్, రాజగోపాల్ అనే వారు హైకోర్టులో శిక్షను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు.
అయితే బుధవారం ఈ కేసు విచారణ కోసం మూడు విడతలుగా ముగ్గురు న్యాయమూర్తుల దగ్గరికి వెళ్ళింది. కానీ వారందరూ విచారణ చేయడాన్ని నిరాకరించారు.
మొదట జస్టిస్ కె. శరత్ ఈ కేసును విన్నారు. అయితే ఆయన “నేను ఈ కేసును వినలేను” అని చెప్పి, ఇది మరో న్యాయమూర్తికి పంపించాలని రిజిస్ట్రీకి చెప్పారు. ఆ తర్వాత జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ దగ్గరికి కేసు వెళ్ళింది. కానీ ఆయన కూడా విచారణ చేయలేనని చెప్పి, మరో న్యాయమూర్తికి పంపాలని ఆదేశించారు. చివరగా జస్టిస్ భీమపాక నగేశ్ వద్దకు కేసు చేరింది. కానీ ఆయన కూడా విచారణ చేయలేనని స్పష్టం చేశారు.
ఈ పరిణామాల తర్వాత కేసు విచారణ జూన్కి వాయిదా పడింది. ఒకేరోజులో ముగ్గురు న్యాయమూర్తులు విచారణ చేయడానికి నిరాకరించడంతో ఇది న్యాయవర్గాల్లో ఆసక్తికరమైన అంశంగా మారింది.