ఖమ్మంలో మహిళా పోలీసు అధికారిపై దాడి చేసిన కాంగ్రెస్ నేత<వీడియో>
ఖమ్మం జిల్లా కల్లూరులో శుక్రవారం రాత్రి ఒక తీవ్ర సంఘటన జరిగింది. తల్లాడకు చెందిన కాంగ్రెస్ నాయకుడు రాయల రాము మద్యం మత్తులో ఓ హోటల్కి వచ్చాడు. అక్కడ పరోటా విషయమై హోటల్ సిబ్బందితో గొడవ పడాడు. ఆ వెంటనే తన అనుచరులను పిలిపించి పెద్ద దాడికి దిగాడు.
ఈ పరిస్థితిని అదుపులోకి తేవడానికి మహిళా ఎస్ఐ హరిత అక్కడికి వెళ్లింది. ఆమె శాంతి నెలకొల్పేందుకు ప్రయత్నించగా, రాయల రాము వినకుండా ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఆగ్రహంతో ఆమెను తోసి, ఛాతీపై చేయి పెట్టి దూషించాడు. ఇది చాలా అసభ్యంగా, నిబంధనలకు విరుద్ధంగా ఉంది.
పోలీసులు వెంటనే స్పందించి రాయల రాముతో పాటు మరో ఐదుగురిని అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేసి స్టేషన్కి తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మహిళా పోలీసుపై దాడి చేయడం ఎంత తప్పో తెలియజేస్తున్నారు.
ఇలాంటి సంఘటనలు జరగకూడదని, నాయకులు బాధ్యతగా ప్రవర్తించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.