Home
POLITICAL NEWS
TELUGU POLITICAL NEWS NEWS360 POLITICAL VOICE FEATURES VOICE
FILM NEWS
TELUGU FILM NEWS SHORT STORIES MOVIE REVIEWS
SPORTS News Business News Reach Out
Home  »  Political Voice   »   చేప మందు కోసం భారీగా ప్రజలు – వృద్ధుడి గుండెపోటుతో మృతి

చేప మందు కోసం భారీగా ప్రజలు – వృద్ధుడి గుండెపోటుతో మృతి

ప్రతి ఏడాది మృగశిర కార్తి రోజున జరిగే బత్తిని కుటుంబం చేప మందు పంపిణీ కార్యక్రమం ఈసారి కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మంది ప్రజలు ఈ ప్రత్యేక మందు కోసం బారులు తీరారు.

ఇలాంటి సందర్బంలో ఒక దురదృష్టకర ఘటన జరిగింది. మెదక్‌ జిల్లాకు చెందిన 75 ఏళ్ల సత్యనారాయణ అనే వృద్ధుడు, క్యూలో వేచి ఉండగా గుండెపోటుకు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను వైద్య శిబిరానికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

ఈసారి తెలంగాణ ప్రభుత్వం మత్స్యశాఖ ఆధ్వర్యంలో 35 కౌంటర్లలో చేప మందు పంపిణీ జరిగింది. సుమారు 1.5 లక్షల మందికి మందు ఇచ్చారు. ఒక్కొక్కరికి రూ.40 చొప్పున టోకెన్లు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఇతర కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. వారు మొదటిగా చేప ప్రసాదం తీసుకున్నారు.

బత్తిని అమర్నాథ్ గౌడ్ కుటుంబం గత 170 ఏళ్లుగా ఈ చేప మందు సేవను అందిస్తోంది. దీనికి దేశం నలుమూలల నుంచి ప్రజలు వచ్చి పాల్గొంటారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ, ఇది ఆరోగ్యానికి మంచిదని, బత్తిని కుటుంబం ప్రజల కోసం నిస్వార్థంగా చేస్తున్న సేవను అభినందించారు.

ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి అల్పాహారం, భోజనం, నీరు వంటి ఏర్పాట్లు చేశాయి. ఇది ప్రజలకు చాలా సహాయంగా మారింది.

మొత్తానికి ఈ కార్యక్రమం పెద్ద స్థాయిలో జరిగిందని చెప్పినా, పూర్తి భద్రతా, వైద్య ఏర్పాట్లు ఉండి ఉంటే ఈ ప్రమాదం తప్పిపుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. భవిష్యత్తులో మరింత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Get In Touch

© APTG360. All Rights Reserved.