Home
POLITICAL NEWS
TELUGU POLITICAL NEWS NEWS360 POLITICAL VOICE FEATURES VOICE
FILM NEWS
TELUGU FILM NEWS SHORT STORIES MOVIE REVIEWS
SPORTS News Business News Reach Out
Home  »  Political Voice   »   డీఎస్సీ పరీక్షలు నిలిపివేయాల్సిన అవసరం లేదు – హైకోర్టు నిర్ణయం.

డీఎస్సీ పరీక్షలు నిలిపివేయాల్సిన అవసరం లేదు – హైకోర్టు నిర్ణయం.

ఆంధ్రప్రదేశ్‌లోని మెగా డీఎస్సీ 2025 పరీక్షలు ఆలస్యమవుతాయేమోనని చాలామందికి టెన్షన్‌ అయితే, హైకోర్టు దీనిపై స్పష్టత ఇచ్చింది. జూన్ 6నుండి జరగబోయే డీఎస్సీ రాత పరీక్షలను నిలిపివేయాలంటూ కొంతమంది అభ్యర్థులు కోర్టులో పిటిషన్లు వేశారు. కానీ, హైకోర్టు ఇవి సరైన కారణాలతో లేవని చెప్పి పిటిషన్లను తిరస్కరించింది.

హైకోర్టు స్పష్టంగా చెప్పింది – “ఇప్పటికే పరీక్షకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. హాల్‌టికెట్లు ఇచ్చాం. ఇప్పుడు పరీక్షలు ఆపటం తగదు.” ప్రభుత్వానికి ఉద్యోగ నియామకాల విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు ఉందని కూడా కోర్టు పేర్కొంది.

కొంతమంది అభ్యర్థులు 2024 డీఎస్సీకి అర్హులు అయినా, వయసు కారణంగా 2025 నోటిఫికేషన్‌కు తాము అర్హులు కాదని వాదించారు. ఇంకొందరు CBSE విద్యార్థులకు న్యాయం చేయాలంటూ పిటిషన్ వేశారు. అయితే, ప్రభుత్వ న్యాయవాది మాట్లాడుతూ – “ఈవేళ వయో పరిమితికి సంబంధించి ఇప్పటికే నిబంధనలు ఖచ్చితంగా ఉన్నాయి. హాల్‌టికెట్లు ఇచ్చేశాం. ఇప్పుడు పరీక్షలు వాయిదా వేయడం సరికాదు” అన్నారు.

ఇతర పిటిషన్లలో B.Ed చివరి సంవత్సరం చదువుతున్న వాళ్లకు అవకాశం ఇవ్వకపోవడం, టెట్ పరీక్షలు రెండుసార్లు జరగలేదని వాదనలు వచ్చాయి. అయితే కోర్టు ఇవన్నీ పరిశీలించి, పరీక్షలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం లేదని తేల్చేసింది.

మొత్తంగా, డీఎస్సీ 2025 పరీక్షలు నిర్ణయించిన తేదీల్లోనే జరగనున్నాయి. అభ్యర్థులు ఎలాంటి అయోమయంలో పడకండని, హాల్‌టికెట్లతో సహా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు.

Get In Touch

© APTG360. All Rights Reserved.