భారత్ సింధు జలాలను ఆపాలంటే కోట్లాది ఖర్చు: పాకిస్తాన్ అభిప్రాయం
పాకిస్థాన్కు రావాల్సిన సింధు నదీ జలాలను భారత్ పూర్తిగా అడ్డుకోవడం చాలా కష్టం అని పాకిస్థాన్కు చెందిన పరిశోధకుడు మొహమ్మద్ ఉస్మాన్ చెప్పారు. కరాచీలో జరిగిన ఓ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వివరించారు.
ఉస్మాన్ మాటల్లో ప్రకారం, భారత్ అలా చేయాలంటే బిలియన్ల డాలర్లు ఖర్చు చేసి భారీ మౌలిక సదుపాయాలు ఏర్పరుచుకోవాలి. ఇది తక్షణమే జరిగే పని కాదు. ఎగువన ఉన్న ప్రాంతాల్లో నీరు నిలిపేస్తే ముంపు వస్తుంది. అదే నీటి కొరత ఉన్న సమయంలో అడ్డుకుంటే, పాక్ రైతులపై తీవ్రమైన ప్రభావం పడుతుంది.
అలాగే ఆయన చెప్పిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే – భారత్ ఇలా చేస్తే, చైనా కూడా అదే విధంగా బ్రహ్మపుత్ర నదిపై నీటిని భారత్కు పంపకుండా అడ్డుకోవచ్చు. అంటే, నీటి రాజకీయాలు దేశాల మధ్య మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది.
ఈ సందర్భంలో, పాకిస్థాన్ అంతర్జాతీయ వ్యవహారాల సంస్థ (PIIA) చైర్పర్సన్ డాక్టర్ మసూమా హసన్ మాట్లాడుతూ, భారత్తో నెలకొన్న తాజా పరిణామాలను దృష్టిలో పెట్టుకుని, యువతతో పాటు అన్ని వర్గాల అభిప్రాయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.