వర్షాకాల రేషన్ నిల్వలకు గడువు కోరిన తెలంగాణ ప్రభుత్వం
వర్షాకాలం రాకముందే మూడు నెలల రేషన్ బియ్యం నిల్వ చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలకు తెలంగాణ ప్రభుత్వం స్పందిస్తూ, తక్షణమే మూడు నెలల రేషన్ను సమకూర్చడం కష్టమని కేంద్రానికి లేఖ రాసింది.
రాష్ట్ర ప్రభుత్వం లేఖలో, బియ్యం నిల్వలను జూన్ చివరికి పూర్తిచేసేలా అవకాశం ఇవ్వాలని కోరింది. వర్షాకాలంలో వర్షాలు, వరదలు వల్ల రేషన్ను ప్రజలకు పంపించడం కష్టమవుతుందని కేంద్రం తెలిపిన విషయం తెలిసిందే. అందుకే జూన్, జూలై, ఆగస్టు నెలల బియ్యం కోటాను ముందుగానే సిద్ధం చేయాలని కేంద్రం సూచించింది.
తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 5 లక్షల టన్నుల బియ్యం అవసరం ఉంటుంది. అయితే రాష్ట్రంలో ఇటీవలే సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభించడంతో, ఇప్పటికిప్పుడు మూడు నెలల బియ్యం నిల్వ చేయడం కుదరదని అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో, జూన్లో ఒక నెల రేషన్, జూలైలో మిగిలిన రెండు నెలల రేషన్ను సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. కేంద్రం ఈ గడువు పొడిగింపు అభ్యర్థనను పరిశీలించి సహకరించాలని తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తోంది.