నటి రుక్మిణి విజయ్ కుమార్ కారులో రూ.23 లక్షల విలువైన చోరీ – డ్రైవర్ అరెస్టు
నటి రుక్మిణి విజయ్ కుమార్ కారు నుంచి దొంగలు భారీగా చోరీ చేశారు. మొత్తం రూ.23 లక్షల విలువైన నగలు, గడియారం, బ్యాగులు దొంగతనానికి గురయ్యాయి. పోలీసులు విచారణ చేసి నిందితుడైన డ్రైవర్ మస్తాన్ను అరెస్టు చేశారు.
ఈ నెల 11న రుక్మిణి మోర్నింగ్ వాక్కి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంకి వెళ్లారు. అక్కడ ఆమె తన కారును పార్క్ చేసి లోపలికి వెళ్లిపోయారు. తొందరలో కారును లాక్ చేయడం మర్చిపోయారు. కారు లోపల ఉన్నవి చాలా ఖరీదైనవి — వజ్ర ఉంగరాలు, రోలెక్స్ వాచ్, బ్రాండెడ్ హ్యాండ్బ్యాగులు ఉన్నాయి.
అప్పట్లో అక్కడే ఉన్న ట్యాక్సీ డ్రైవర్ ముహమ్మద్ మస్తాన్ ఈ విషయం గమనించి, కారులోకి వెళ్లి అందులో ఉన్న విలువైన వస్తువుల్ని తీసేసాడు. తరువాత రుక్మిణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు మస్తాన్ను గుర్తించి పట్టుకున్నారు. అతనివద్ద దొంగిలించిన వస్తువులను తిరిగి స్వాధీనం చేసుకున్నారు.
రుక్మిణి, ప్రముఖ నటి మాత్రమే కాదు, స్వతహాగా కన్నడ అమ్మాయి. కొరియోగ్రాఫర్గా కెరీర్ ప్రారంభించి, తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టారు. ‘సీతారామం’ సినిమాలో ఆమె రేఖ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.