భైరవం ట్రైలర్ ఈవెంట్లో మనోజ్ ఎమోషనల్ – నారా రోహిత్ మద్దతు
మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ కలిసి నటిస్తున్న కొత్త చిత్రం భైరవం మే 30న విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఏలూరులో జరిగింది. ఈ ఈవెంట్ చాలా గ్రాండ్గా జరగింది.
ఈ సందర్భంగా మంచు మనోజ్ తన జీవితంలో ఎదురైన కొన్ని కష్టం విషయాలను స్టేజ్పై షేర్ చేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. కుటుంబం మద్దతు ఇవ్వకపోయినా, తన అభిమానులు ఎప్పుడూ తనతో ఉన్నారని చెప్పి ఎమోషనల్ అయ్యారు. తాను పరిశ్రమలోకి ఏడేళ్ల తర్వాత మళ్లీ వస్తున్నానని, ఈ సినిమా తనకు చాలా స్పెషల్ అని అన్నారు.
మనోజ్ స్పీచ్కి స్పందనగా నారా రోహిత్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఆయన అందులో ఇలా రాశారు:
“ఈవెంట్ అద్భుతంగా జరిగింది. మన బాబాయ్ మనోజ్ చాలా పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు. ఆ మాటలు నన్ను కూడా ప్రభావితం చేశాయి. బాబాయ్, నిన్ను ఎవరు మద్దతు ఇవ్వకపోయినా, నేను మాత్రం ఎప్పుడూ నీతో ఉంటా.”
ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
భైరవం సినిమా తమిళంలో హిట్ అయిన “గరుడన్” రీమేక్. ఇందులో ఆదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్ళైలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇదే తెలుగులో అదితి శంకర్ మొదటి సినిమా కావడం విశేషం.
ఇప్పుడు భైరవం సినిమాపై అంచనాలు పెరిగాయి. ప్రేక్షకులు మనోజ్కి మళ్లీ ఒక మంచి హిట్ కావాలని కోరుకుంటున్నారు.