రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై మరోసారి వివాదం
ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ మళ్లీ వార్తల్లో నిలిచారు. ఇటీవల జరిగిన ఒక సినిమా దర్శకుడి పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న ఆయన, స్టేజ్ పై మాట్లాడే సమయంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
ఈ వేడుకలో నటుడు అలీ గురించి చేసిన వ్యాఖ్యలు (లం***** కొడుకు)కొంతమందికి అభ్యంతరకరంగా అనిపించాయి. ఆయన మాట్లాడిన తీరు హాస్యంగా ఉండాలన్న ఉద్దేశం ఉన్నా, కొన్ని మాటలు అదుపు తప్పినట్లు సోషల్ మీడియాలో చాలామంది అభిప్రాయపడుతున్నారు.
ఇదివరకూ కూడా రాబిన్ హుడ్ సినిమాకు సంబంధించిన ఈవెంట్లో రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆయన ఓ అంతర్జాతీయ ఆటగాడిపై తీవ్రంగా స్పందించడంతో, క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలో ప్రేక్షకులు, అభిమానులు ఒక్కొక్కసారి హాస్యం కూడా ఒక హద్దు దాటితే అది అపార్థాలకు దారి తీయవచ్చని భావిస్తున్నారు. పెద్దవారు వేదికపై మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై రాజేంద్ర ప్రసాద్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.