సందీప్ రెడ్డి వంగా పట్ల అన్యాయం జరిగిందా? నిజాలను తెలుసుకోండి
టాలీవుడ్లోనూ బాలీవుడ్లోనూ తన స్టైల్కు పేరుగాంచిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, తాజా వివాదానికి మధ్యలో ఉన్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి సంచలన చిత్రాలతో ప్రేక్షకుల మన్ననలు పొందిన ఈ దర్శకుడు ఇప్పుడు ‘స్పిరిట్’ అనే ప్రాజెక్ట్కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో తొలుత హీరోయిన్గా దీపికా పదుకోణ్ పేరు ప్రకటించారు. అయితే కొన్ని వివాదాల మధ్య ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.
అసలు సంగతి ఏంటి?
దీపికా పదుకోణ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారన్న విషయం తెలియగానే కొందరు మీడియా వర్గాలు, ఆమె పీఆర్ టీం సందీప్ రెడ్డి వంగా మీద తప్పుడు వార్తలు ప్రచారం చేయడం ప్రారంభించాయి. అయితే దర్శకుడు వంగా ఈ విషయంపై స్పందిస్తూ – “నేను కథ చెప్పినప్పుడు ఒక విశ్వాసం ఉంటుంది. దీపిక కథ విని అంగీకరించింది. ఇప్పుడు ఆమె వెనక్కి వెళ్లడం వల్ల అసలు కథను లీక్ చేసి, నన్ను తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు,” అన్నారు.
నిజంగా తప్పెవరిది?
సందీప్ రెడ్డి వంగా తరఫున పరిశీలిస్తే – ఒక దర్శకుడిగా కథ మీద ప్రేమతో, శ్రద్ధతో పనిచేస్తుంటారు. ఏదైనా పాత్ర కోసం ఆయన చేసే ఎంపికలు బలమైనవి, స్టోరీకి న్యాయం చేసే విధంగా ఉంటాయి. దీపిక వర్కింగ్ అవర్స్ గురించి ముందుగానే చెప్తే, దర్శకుడిగా దానిపై ఓ నిర్ణయం తీసుకోవడం తప్పు కాదు. పైగా, కథను లీక్ చేయడమో లేదా బైట ప్రకటనలు చేయడమో వంగా చేయలేదు.
దర్శకుడి గౌరవం ఏమైంది?
ఇక్కడ దర్శకుడి గౌరవం, కథపై ఉన్న నమ్మకమే ముఖ్యంగా నిలవాలి. ఒక నటుడు ప్రాజెక్ట్ నుంచి బయటకి వెళ్లే హక్కు ఉంది. అదే విధంగా, దర్శకుడికీ తన కథ integrity కాపాడుకునే హక్కు ఉంది. దీపిక షరతులు, నిబందనలు వెనుక ముందస్తు చర్చలు లేకుండా వచ్చి, ఆ తర్వాత తప్పుకుంటే అది బాధాకరం.
మద్దతుగా నిలుస్తున్న పరిశ్రమ
ఈ వివాదంపై పరిశ్రమలో కొందరు దర్శకులు, నటులు సందీప్ రెడ్డి వంగా తరఫున నిలిచారు. “ఒక దర్శకుడికి కథ అనేది ప్రాణం లాంటి దాంటిపైన రాజీ పడలేం,” అని అంటున్నారు. అదేవిధంగా కథా బలం ఉన్న ‘స్పిరిట్’ వంటి ప్రాజెక్ట్లను రాజకీయంగా లేదా పీఆర్ గేమ్స్తో దెబ్బతీయడం సమంజసం కాదు అని వారు వ్యాఖ్యానిస్తున్నారు.