ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మరోసారి జంటగా – కొత్త సినిమా ప్రారంభం
హిట్ మూవీ ‘బేబీ’ తర్వాత యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో ఆయనతో పాటు మళ్లీ వైష్ణవి చైతన్య కథానాయికగా నటించనున్నారు. వీళ్లిద్దరిని మళ్లీ తెరపై చూడడం ఫ్యాన్స్కి చాలా ఆనందంగా ఉంది.
ఈ సినిమాకు ఆదిత్య హాసన్ అనే దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు. ఆయన ముందు ‘నైంటీస్: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ అనే వెబ్ సిరీస్తో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు అదే కధను కొనసాగిస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
హైదరాబాద్లో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా రష్మిక మందన్న ఫస్ట్ క్లాప్ కొట్టగా, నటుడు శివాజీ కెమెరా స్విచ్ ఆన్ చేశాడు. ఈ సినిమాకు కథను వెంకీ అట్లూరి అందించారు.
ఈ సినిమా పేరును ఇంకా ప్రకటించలేదు. కానీ ప్రొడక్షన్ నెం. 32 అనే పేరుతో రూపొందిస్తున్నారు. ఇది ఒక లవ్ స్టోరీగా ఉండబోతుందని చిత్ర బృందం తెలిపింది. మిడిల్ క్లాస్ కుటుంబాల్లో జరిగే సన్నివేశాలు, భావోద్వేగాలు ఇందులో ఉంటాయని తెలుస్తోంది.
ఈ సినిమాలో శివాజీ, వాసంతిక వంటి నటులు కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన అనౌన్స్మెంట్ వీడియోకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.
ప్రేక్షకులు ఇప్పుడు ఈ జంట మరోసారి ఏ విధంగా మాయ చేయబోతుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.