వినోదాన్ని ఖరీదుగా మార్చొద్దు – టికెట్ ధరలపై ఆర్. నారాయణమూర్తి స్పందన
తెలుగు నటుడు, దర్శకుడు ఆర్. నారాయణమూర్తి సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని సినిమాల కోసం టికెట్ ధరలు పెంచడం ప్రేక్షకులపై భారం పెడుతుందని చెప్పారు.
అంతే కాకుండా, ఇలా ధరలు పెరిగితే ప్రజలు మళ్లీ థియేటర్కి వెళ్లడానికి వెనుకడుగు వేస్తారని, దీని వల్ల సినీ పరిశ్రమకే నష్టం కలుగుతుందని హెచ్చరించారు. సినిమా మంచి కథతో, మంచి ప్రదర్శనలతో ఉంటే ప్రజలు ఖచ్చితంగా చూడడానికి వస్తారు, టికెట్ ధరలు పెంచాల్సిన అవసరం ఉండదని చెప్పారు.
ఆయన మాట్లాడుతూ, “పాత రోజుల్లో ‘లవకుశ’, ‘షోలే’ లాంటి గొప్ప సినిమాలు తీసినప్పటికీ టికెట్ ధరలు పెంచలేదు. సినిమాలు భారీగా తీయొచ్చు, కానీ ఆ ఖర్చు మొత్తం ప్రేక్షకుల మీద వేయకూడదు,” అని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులు ప్రకటించినందుకు ఆనందం వ్యక్తం చేసిన నారాయణమూర్తి, ఆ అవార్డు విజేతలకు శుభాకాంక్షలు చెప్పారు. అలాగే, ఆంధ్రప్రదేశ్లోనూ సీఎం చంద్రబాబు ‘నంది అవార్డులు’ను మళ్లీ ప్రారంభించాలని కోరారు.