హరిహర వీరమల్లు కోసం రూ.250 కోట్లకుపైగా ఖర్చు చేశామని తెలిపారు దర్శకుడు జ్యోతికృష్ణ
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా పట్ల అభిమానుల్లో పెద్ద అంచనాలు ఉన్నాయి. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రానికి ఏ.ఎం. జ్యోతికృష్ణ మరియు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా ప్రస్తుతం చివరి దశ పనుల్లో ఉంది.
ఇటీవల మచిలీపట్నంలో జరిగిన ఒక ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు జ్యోతికృష్ణ, ఈ సినిమా బడ్జెట్ గురించి ఆసక్తికర విషయం వెల్లడించారు.
అయన మాట్లాడుతూ, “హరిహర వీరమల్లు సినిమా కోసం రూ.250 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. ఈ కథను రెండు భాగాలుగా తీస్తున్నాం. అందుకే భారీగా వ్యయం అవుతోంది,” అని తెలిపారు.
ఇటీవల చిత్రబృందం సినిమాను జూన్ 12న విడుదల చేయాలనే యోచనలో ఉండగా, వీఎఫ్ఎక్స్ పనులు పూర్తికాలేదు అనే కారణంతో విడుదలను వాయిదా వేశారు. త్వరలోనే ట్రైలర్తో పాటు కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు.
ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఎ. దయాకర్ రావు నిర్మాణం వహిస్తుండగా, ఏ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై ఈ చిత్రం రూపొందుతోంది.
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు మంచి స్పందన పొందాయి. ఇప్పుడు దర్శకుడు చెప్పిన బడ్జెట్ సమాచారం సినిమాపై ఆసక్తిని ఇంకా పెంచింది. అభిమానులు ఈ సినిమాను థియేటర్లో చూడడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.