‘హరిహర వీరమల్లు’ టికెట్ ధరల పెంపు కోసం ఫిల్మ్ ఛాంబర్ను కలిసిన ఏఎం రత్నం
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా జూన్ 12న విడుదల కానుంది. ఈ సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేయాలని భావిస్తున్న నిర్మాత ఏఎం రత్నం, సినిమా టికెట్ ధరలు పెంచేందుకు అవసరమైన అనుమతుల కోసం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ను ఆశ్రయించారు.
అధికారికంగా ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్కి వినతిపత్రం అందజేసిన ఆయన, ఆంధ్రప్రదేశ్లో టికెట్ ధరలు పెంచేందుకు మరియు అదనపు షోలు వేయడానికి అనుమతి ఇవ్వాలని కోరారు.
ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్ త్వరలోనే ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించనుంది. సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో, అధిక టికెట్ ధరలు, అదనపు షోలు పెట్టేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే సినిమాకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది.